గోల్నాక, జూలై 5 : పట్టణ ప్రగతి కార్యక్రమం స్ఫూర్తితో ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం అంబర్పేట డివిజన్లోని ప్రేమ్నగర్లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్తో పాటు పలుశాఖల అధికారులతో కలసి ఐదో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రేమ్నగర్లోని పలు బస్తీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, మంచినీటి సరఫరా, వెలగని వీధిలైట్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు బస్తీల్లో రహదారులను అతి త్వరలోనే అభివృద్ధి చేస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజలకు కనీస అవసరాలైన త్రాగునీరు. విద్యుత్, పారిశుధ్యం, విద్య, వైద్యం అందించడమే అసలైన అభివృద్ధి అన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంనేయులు, రామారావు, సిద్దార్థ్ముదిరాజ్, లింగారావు, రాగుల ప్రవీణ్, గౌస్, ప్రకాశ్, మోసిన్, పాకనర్సింగ్, హేమంత్, రంగు ఉదయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.