ఖిల్లాఘణపురం, జూన్ 24 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ వేసినట్లు డాక్టర్ రిజ్వాన తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈవో రవీందర్ హాజరై ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విడతల వారీగా అన్ని శాఖల అధికారులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రభుత్వం ఇస్తుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా లు వేస్తారని తెలిపారు. కరోనా వ్యాక్సిలేషన్ అనంతరం అ న్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి సూచనలు, సలహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఇచ్చిన వందశాతం టార్గెట్ను పూర్తిచేయాలని అందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి రోజు 24 మంది బోధన సిబ్బందికి, 14 మంది బోధనేతర సిబ్బందికి టీకా లు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటి సంరక్షించేలా చూడాలని అన్నా రు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఉపాధ్యాయులకు ప్రారంభమైన వ్యాక్సినేషన్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాధికారి శ్రీనివాస్గౌడ్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు త్వం వచ్చే నెల నుంచి పాఠశాలల్లో బోధన ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ఇస్తారని అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 16 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్ వేయించుకొని విధులకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, వైద్య సిబ్బంది ఉన్నారు.
వీపనగండ్లలో..
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు(టీచింగ్, నాన్ టీచింగ్) మం డల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ను శుక్రవారం వేయించుకోవాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం నలుగురు ఉ పాధ్యాయులు మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారన్నారు. మం డలంలో మొత్తం 114 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బ ంది ఉండగా అందులో 26 మంది ఇదివరకే వ్యాక్సిన్ వేసుకున్నారని, మిగిలిన వారు శుక్రవారం వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీలు వెంకటేశ్, నాగరాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.