ఎల్బీనగర్, జూన్ 20: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమని, రూ.35లక్షల వ్యయంతో సరూర్నగర్ చెరువు తూము వద్ద చెత్తాచెదారం, పేరుకుపోయిన మట్టిని తొలగించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం సరూర్నగర్ చెరువు చివరి తూము ప్రదేశంలో స్థానిక ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చెరువు తూము నందు నీటి ప్రవాహం నెమ్మదిగా ఉండేదని, ప్రస్తుతం జేసీబీ సాయంతో తూములో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. లింగోజిగూడ డివిజన్ గ్రీన్పార్కుకాలనీ, తపోవన్కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పవన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.