స్టేషన్ ఘన్పూర్, జూన్ 2 : కరోనాతో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ టౌన్ నమస్తే తెలంగాణ విలేకరి చిలుపూరి జగన్(49) బుధవారం మృతిచెందాడు. స్టేషన్ఘన్పూర్కు చెందిన జగన్ 26 ఏండ్లుగా పాత్రికేయుడిగా వివిధ పత్రికల్లో పనిచేశాడు. దశాబ్దకాలంగా నమస్తే స్టేషన్ ఘన్పూర్ టౌన్ రిపోర్టర్గా పనిచేస్తున్నా డు. ఐదు రోజుల క్రితం జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. జగన్కి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.