శ్రీనివాస్రెడ్డి, దీక్షిత్శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్రెడ్డి దర్శకుడు. పి. అచ్యుత్ రామారావు నిర్మాత. మంగళవారం ట్రైలర్ను చిత్రబృందం విడుదలచేసింది. ఇంద్రియవైకల్యం కలిగిన ముగ్గురు వ్యక్తులు అనుకోకుండా ఓ హత్యకేసులో చిక్కుకోవడం..ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు వారు పడే ఇక్కట్లతో ట్రైలర్ ఆద్యంతం నవ్వులను పంచుతుంది. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదానికి క్రైమ్ అంశాలను మేళవిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. తమ వైకల్యాన్ని అధిగమించి ముగ్గురు యువకులు వరుస హత్యల కేసు మిస్టరీని ఎలా ఛేదించారు? ఆ హత్యలు చేసిందెవరన్నది ఉత్కంఠను పంచుతుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలో సినిమా విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం: గరుడ వేగ అంజి