ముషీరాబాద్, మే 22: ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ చేపల మార్కెట్లో రూ. 99 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేపల మార్కెట్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే మురుగు సాఫీగా వెళ్లేలా పైపులైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో చేపల మార్కెట్లో రెండు వైపులా రోడ్డు నిర్మాణం చేపట్టి ఎక్కడా నీరు నిలువ ఉండకుంగా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తరలింపు విషయమై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ ఎం.సుప్రియా నవీన్ గౌడ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ సన్నీ, ఏఈ తిరుపతి, వర్కు ఇన్స్పెక్టర్ దాస్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు అహ్మదుల్లా భక్తియారి, రాజా దీన్దయాల్రెడ్డి, గాండ్ల గణేశ్, జీ.ప్రసాద్. డింబా, చందు, శ్రీకాంత్ గౌడ్, రాజేందర్, గోవింద్, బుజ్జి రవి, బల్ల ప్రశాంత్, బీజేపీ నాయకులు నవీన్గౌడ్, కంచి, బద్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.