కమలాపూర్ మండల సర్పంచులు
టీఆర్ఎస్ను వీడమని వెల్లడి
వరంగల్ సబర్బన్, మే 21 : రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాతనే తమకు నిజమైన స్వా తంత్య్రం వచ్చినట్లయిందని హుజూరా బాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల సర్పంచులు పేర్కొన్నారు. శుక్ర వారం కమలాపూర్ మండలం నుంచి ఆరు గ్రామాల సర్పంచులు పరకాల ఎ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు. ప్రభు త్వం ప్రవేశ పెట్టిన పథకాలు పేద ప్రజలందరికీ అందుతున్నాయని, తాము టీఆర్ఎస్ను వీడేదిలేదని స్పష్టం చేశారు. దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నా రు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అ త్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. వ్యక్తుల కోసం సిద్ధాంతాలను వదులుకోమని చెప్పారు. మండల ఇన్చార్జిగా పార్టీ నియమించిన పరకాల ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డి సూచనల మేరకే నడుచుకుంటామని వివరించారు. కమలాపూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అన్నివిధాల ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇక నుంచి మా గ్రామాల్లో అభవృద్ధి పనులపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఎవరు భయపెట్టినా తాము గులా బీ జెండాను విడువమని తెగేసి చెప్పారు. సొంత లాభం కోసం పార్టీకి ద్రోహం తల పెట్టిన వారిని వదిలేది లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ పర్యవేక్షకుడు పేర్యాల రవీందర్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎర్రం ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకు డు పింగిళి ప్రదీప్రెడ్డి, సర్పంచులు పింగిళి రవళీరంజిత్ రెడ్డి, లడె గోపాల్, కంచనకుంటల విజేందర్రెడ్డి, ఇనుగాల విజయ్, ఎర్రబెల్లి దేవేందర్ రావు, దొంగల శ్రీనివాస్ పాల్గొన్నారు.