మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
పలు వార్డుల్లో జ్వర సర్వే పరిశీలన
సిరిసిల్ల టౌన్, మే 2: కరోనా కట్టడికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్నదని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కోరారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న జ్వర సర్వేను శనివారం ఆమె పరిశీలించి, మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ, మెప్మా సిబ్బంది మున్సిపల్ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారని తెలిపారు. కరోనా లక్షణాలుంటే సర్వే సిబ్బందికి వివరాలు చెబితే మెడికల్ కిట్లు అందజేస్తారని చెప్పారు. హోం ఐసొలేషన్ ఉన్నవారు మం దులు, ఆహారం విషయంలో పాటించాల్సిన నియమాలను వివరించాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కోరారు.
వేములవాడ, మే 8: మున్సిపల్ పరిధిలో శనివారం కూడా జ్వర సర్వే నిర్వహించామని కమిషనర్ శ్యామ్సుందర్రావు తెలిపారు. మొత్తం 28 వారుల్లో 28 బృందాలు 2,165 ఇండ్లకు వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించినట్లు చెప్పారు. జ్వరం ఉన్న 39మందికి ఆరోగ్య కిట్లు ఆందజేసినట్లు తెలిపారు. శనివారం నాటికి మున్సిపల్ పరిధిలో 7,104 ఇండ్లల్లో సర్వే చేసినట్లు పేర్కొన్నారు.
చందుర్తి, మే 8: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరుకు శనివారం సైతం పలు గ్రామాల్లో సిబ్బంది జ్వర సర్వే చేశారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వేములవాడ రూరల్, మే 8: వేములవాడ, వేములవాడ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్ల, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరంతోపాటు వారి ఆరోగ్య స్థితిగతులను నమోదు చేసుకుంటున్నారు. ఎవరికైనా జ్వరం వస్తే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరోగ్య కిట్లు అందజేస్తున్నారు. చీర్లవంచలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్శ, సునీత, భాగ్యలక్ష్మి, ఆశ కార్యకర్తలు విజయలక్ష్మి, రేణుక, లక్ష్మి ఉన్నారు.
జ్వర సర్వే పూర్తి
ముస్తాబాద్, మే 8: కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశా ల మేరకు మండలంలో జ్వర సర్వేను పూర్తి చేశామని మండల వైద్యాధికారి సంజీవరెడ్డి శనివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. మండలంలోని 22 గ్రామాల్లో 15,999 కుటుంబాలను గుర్తించి మూడు రోజులుగా 160మందితో 53 బృందాలుగా ఇంటింటా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో 447మందికి సల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారికి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసి, మెడికల్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. మం దుల వాడకంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.