న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలువుతున్నాయి. అలాగే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ పరీక్ష సర్టిఫికెట్ చూపాలని చెబుతున్నాయి. దీంతో ఈ ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. ఫలితంగా ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున సర్వీసులను రైల్వేశాఖ రద్దు చేసింది. తాజాగా దురందో, రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సంబంధిత రైళ్లు ఈ నెల 9 నుంచి అందుబాటులో ఉండవని.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైళ్లు నడవవని నార్త్ రైల్వేశాఖ తెలిపింది. విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించింది.