హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించినట్లు తెలిసింది.
ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేశ్ రెడ్డి హాజరయ్యారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్న విషయం తెలిసిందే.
వచ్చి రావడంతోనే ఆయన రాష్ట్రంలో కరోనా కట్టడిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి మహమ్మారి కట్టడికి పలు సూచనలిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.