దౌల్తాబాద్, మే 5 : ఓ రైతు వరి కోత కోయడానికి హార్వేస్టర్ను కొండపోచమ్మ నుంచి దౌల్తాబాద్ మీదగా రామంపేట వెళ్లే కెనాల్ దారిపై తీసుకెళ్లుతుండగా అదు పు తప్పిన హార్వేస్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దౌల్తాబాద్, కోనాయిపల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది.
దౌల్తాబాద్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన రైతు వడ్డెర బోదాస్ యాదగిరి హార్వేస్టర్ను కిరాయికి తీసుకొని దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన పిట్ల హరిబాబు ను డ్రైవర్గా పెట్టుకున్నాడు. బుధవారం కోనాయిపల్లి గ్రామ శివారులో వరి కోయడానికి కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి దౌల్తాబాద్ మీదుగా రామంపేటకు వెళ్లే కాలువ దారిపై హార్వేస్టర్ను డ్రైవర్ హరిబాబు(28) నడుపుకుంటూ వెళ్త్తుండగా, అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుకున్న ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య కవిత, ముగ్గురు చిన్నపిల్లలు ప్రసాద్, మల్లికార్జున్, అమ్ములు ఉన్నారు.