లక్నో: దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగం కొనసాగుతున్నది. రోజూ వేలమందిని కరోనా వైరస్ బలితీసుకుంటూనే ఉన్నది. పేదపెద్ద అన్న తేడా ఏమిలేకుండా రోజూ అన్ని వర్గాల ప్రజలు కరోనా కాటుకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా కరోనా బారినపడి సోమవారం తెల్లవారుజామున మరణించారు.
మనోజ్ మిశ్రాకు ఇటీవల కొవిడ్-19 పాజిటివ్గా తేలడంతో అతడిని కాన్పూర్లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. కాగా, మనోజ్ మిశ్రా మృతికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ మిశ్రా కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.