కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలి
పీఏసీఎస్ చైర్మన్లు కిషన్రావు, శ్రీనివాస్
పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చందుర్తి, మే 2: రైతులు దళారులను ఆశ్రయించవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సనుగుల, చందుర్తి పీఏసీఎస్ చైర్మన్లు జలగం కిషన్రావు, తిప్పని శ్రీనివాస్ సూచించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో బండపల్లి, మూడపల్లి, కిష్టంపేటలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజనూ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులు కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచులు చిలుక అంజిబాబు, న్యాత విజయ, అంబిరి కల్పన, ఉప సర్పంచ్ గంగాధర్, వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్లు పుల్కం లచ్చయ్య, చింతపంటి రామస్వామి, నేవూరి శంకర్రెడ్డి, గడ్డం తిరుపతిరెడ్డి, ఏఈవో రమ్య, ఆర్బీఎస్ కన్వీనర్ సంటి బాపురావు, ఆర్బీఎస్ జిల్లా కార్యదర్శి బొప్ప వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షుడు మల్యాల గంగనర్సయ్య, నాయకులు కొండ లక్ష్మణ్, బాలకృష్ణ, ముస్కు మల్లారెడ్డి, కోరె మల్లేశం, దయాకర్, సీఈవోలు శ్రీవర్ధన్, గంగారెడ్డి ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 2: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచ్ అజ్మీరా మంజుల పేర్కొన్నారు. బాకుర్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. తిమ్మాపూర్ సర్పంచ్ పడిగెల రవీందర్, ఉప సర్పంచ్ యశ్వంత్, నాయకులు రాంసింగ్, భీమ, భాస్కర్, మోహన్నాయక్, సురేశ్, హీరా, హరిసింగ్ ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు
ముస్తాబాద్, మే 2: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు పేర్కొన్నారు. మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సందర్శించి వసతులను పరిశీలించారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజనూ కొంటామని చెప్పారు. కేంద్రాల్లో ఉన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని నిర్వాహకులకు ఫోన్ ద్వారా సూచించారు.