గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు
జన్యుక్రమం మార్చుకొన్న B.1.167
ఒకదాంట్లో కొత్త రకం స్పైక్ప్రోటీన్
హైదరాబాద్, ఏప్రిల్ 26: కరోనా సెకండ్ వేవ్కు కారణమని భావిస్తున్న డబుల్ మ్యుటెంట్ వైరస్ B.1.167 తన జన్యుక్రమాన్ని మార్చుకొని ట్రిపుల్ మ్యుటెంట్గా మారినట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘B.1.167 మూడు రూపాంతరాలు చెందింది. అందులో B.1.167.1 రూపాంతరానికి అదనంగా V382L స్పైక్ ప్రోటీన్ ఉంది. దీనిని ట్రిపుల్ మ్యుటెంట్గా భావించవచ్చు. అయితే ప్రస్తుతం కేసులు పెరగడానికి ఇది కారణమా.. కాదా అన్నది తెలియదు. ఇంకా పరిశోధనలు జరుగాల్సి ఉన్నది’ అని సీసీఎంబీ శాస్త్రవేత్త దివ్యతేజ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్ను మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, చండీగఢ్లో గుర్తించారు. బెంగాల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తుండటంతో దీనిని బెంగాల్ మ్యుటెంట్ అని పిలుస్తున్నారు. మిగతా రూపాంతరాలు B.1.167.2, B.1.167.3.