ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 25 : కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం అందజేసిన ఉచిత సన్నబియ్యాన్ని ఆదివారం మండలంలోని కొరటికల్లో సర్పం చ్ సామ తిర్మల్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రేషన్ డీల ర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపురంలో బియ్యం పంపిణీ
రాజాపేట: మండలంలోని రఘునాథపురంలో పాఠశాలల్లో విధులు నిర్వహించే ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన బియ్యాన్ని ఆదివారం సర్పంచ్ శ్రవణ్కుమార్ పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజు, టీచర్లు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను ఆదుకోవడం హర్షణీయం
గుండాల: కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉచితంగా 25 కేజీల బియ్యంతో పాటు నెలకు 2వేల రూపాయలు అందజే యడం హర్షించదగ్గ విషయమని గుండాల సర్పంచ్ చిందం వరలక్ష్మి, ఎంపీటీసీ కుంచాల సుశీల అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో వారికి బియ్యం అందజేసి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా కేవ లం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదు కుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్య క్రమంలో సీఆర్పీ లింగయ్య, ఉపాధ్యాయులు వెంపటి రమే శ్, బుచ్చమ్మ, సోమయ్య, శ్రీరాములు, రమేశ్ పాల్గొన్నారు.