అహ్మదాబాద్: గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్కు కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని నితిన్ పటేల్ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు మెహతా ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు గుజరాతీలో ట్వీట్ చేశారు.
64 ఏండ్ల నితిన్ పటేల్ డిప్యూటీ సీఎంతోపాటు ఆరోగ్య మంత్రిగాను ఉన్నారు. శుక్రవారంతోపాటు శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం రూపానీతో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నితిన్ పటేల్ నెల కిందట కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు.