మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
మహాలక్ష్మి వాడలో సీసీ రోడ్లు
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 23: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో రూ.40లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పట్టణంలో ఐదు చోట్ల అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేస్తామన్నారు.
నిబంధనలు పాటించాలి..
కరోనా వ్యాపిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, తాటిగూడ, పలు కాలనీల్లో ప్రత్యేక వాహనాలతో పాటు మున్సిపల్ సిబ్బందితో హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయించారు. మున్సిపల్ చైర్మన్ కాలనీల్లో తిరుగుతూ శానిటైజేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ కేసులు ఉన్నందునా, కాలనీల్లో ప్రతి రోజూ శానిటైజేషన్ చేయిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు సంద నర్సింగ్, పందిరి భూమన్న, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, నాయకులు సంజయ్, సంతోష్ కుమార్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్