ప్రైవేట్ టీచర్లకు అండగా ప్రభుత్వం
25 కిలోల సన్న బియ్యం, 2వేలు, పంపిణీ
దయాహృదయుడు సీఎం కేసీఆర్
ఎమ్మెల్యేలు రసమయి, రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ అరుణ
పలు చోట్ల ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ
తెలంగాణ చౌక్, ఏప్రిల్ 22: కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులను సీఎం కేసీఆర్ గుర్తించి సాయం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో రేషన్ దుకాణం ద్వారా ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2వేల నగదు, 25 కిజీల సన్నబియ్యం అందిస్తున్నారని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా 1,251మందికి లబ్ధి చేకురుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ సాయాన్ని పారదర్శకంగా చేరేవిధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎలుసాని ప్రవీణ్ కుమార్, డీఈవో రాధాకిషన్, ఎంఈవో దూస రఘుపతి, ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: రసమయి
ఇల్లంతకుంట, ఏప్రిల్ 22: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్ పేర్కొన్నారు. గురువారం యాన మండల కేంద్రంలో 35మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు 25కిలోల సన్న బియ్యం, రూ.2వేల విలువైన చెక్కులను అందజేసి, మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు చేయూతనిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ఉపాధ్యాయులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు ఒగ్గు నర్సయ్య, తీగల పుష్పలత, ఉప సర్పంచ్ సాదుల్, నాయకులు బాలరాజు, అనిల్, భాస్కర్, తిరుపతి పాల్గొన్నారు.
సంతోషంగా ఉండాలి: సుంకె
బోయినపల్లి, ఏప్రిల్ 22: సంక్షోభంలోనూ ప్రజలంద రూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మండల పరిషత్ ఆవరణలో 58మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు 25కిలోల బియ్యం పంపిణీ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలు ఆకలితో అలమటించవద్దని రూ.2వేలతోపాటు 25కిలోల బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ తహసీల్దార్ యుగేంధర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు ఇల్లందుల శంకర్, చిందం రమేష్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, ఎంపీటీసీ అక్కెనపల్లి ఉపేందర్, నాయకులు ఉన్నారు.
ముస్తాబాద్, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో 84మంది ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య రూ.2వేలతోపాటు 25కిలోల సన్నబియ్యం అందజేశారు. ఇక్కడ సర్పంచ్ గాండ్ల సుమ తి, ఉప సర్పంచ్ వేముల రవీందర్గౌడ్, ఎంపీటీసీ మం జుల, మండల కోఆప్షన్ సభ్యుడు సాదుల్పాషా, ఎంఆర్పీ శ్రీకాంత్, శేరయ్య, నర్సింహులు, బాబు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 22:మండల కేంద్రంతోపాటు బొప్పాపూర్లో ప్రైవేట్ ఉపాధ్యాయులకు జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక సన్నబియ్యం పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వినియోగించాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య కోరారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, ఆర్బీఎస్ కన్వీనర్ రాధారపు శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్, పిల్లి కిషన్, ఎండీ బాబా ఉన్నారు.
చందుర్తి, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో ప్రైవేట్ టీచ ర్లు, సిబ్బందికి అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీడీవో రవీందర్, ఆర్ ఐ బాలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతి, ట్రస్మా మం డలాధ్యక్షుడు రాచర్ల రాజు, నాయకులు పులి సత్యం, ఎంఆర్సీలు తిరుపతిరెడ్డి, దేవరాజు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్, ఏప్రిల్ 22: వేములవాడ మండ లం రుద్రవరంలోప్రైవేట్ టీచర్లకు 25కేజీల బియ్యాన్ని జడ్పీటీసీ మ్యాకల రవి అందజేశారు. ఇక్కడ ఎంపీడీవో నరేశ్ఆనంద్, సర్పంచ్ ఊరడి రాంరెడ్డి, ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ, ఉప సర్పంచ్ తాడెం శ్రీనివాస్, సీఆర్పీ సంతోషి, కార్యదర్శి దిలీప్రెడ్డి, డీలర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
వేములవాడ, ఏప్రిల్22: పట్టణంలోని చెక్కపల్లి రోడ్డులోని రేషన్షాపు ప్రైవేట్ పాఠశాల టీచర్లు, సిబ్బందికి రూ.2వేలతోపాటు 25కిలోల బియ్యాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అందజేశారు. ఇక్కడ తహసీల్దార్ మునీందర్, ఎంఈవో బానాజి, వైస్ చైర్మన్ మధురాజేందర్, కౌన్సిలర్ సునంద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రుద్రంగి, ఏప్రిల్ 22: మండల కేంద్రంలోని ప్రైవేట్ టీచర్లకు ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య 25కిలోల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య, నాయకులు గంగం మహేశ్, చెప్యాల గణేశ్, కోల మధు, ఉపేంధర్, వీఆర్వో నారాయణ, ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది ఉన్నారు.