ప్రైవేటుకు దీటుగా బస్తీ దవాఖానలు
గంగానగర్లో రోజుకూ వంద మందికి పైగా వైద్యసేవలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
గోల్నాక, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే బృహత్తర సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తం గా వైద్య ఆరోగ్య శాఖ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది.. ఇందులో భాగంగా రెండేండ్ల క్రితం అంబర్పేట నియోజకవర్గం గోల్నాక గంగానగర్లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడంతో పేదలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందిస్తున్నా రు. ఉదయం 9 నుంచి సాయంత్రం4గంటల వరకు బస్తీ దవాఖాన పనిచేస్తోంది. మధుమేహం, బీపీ తదితర సాధారణ వ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులు, చిన్నపిల్లకుకు సంబంధిచిన వ్యాధులతో పాటు గర్భిణులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా నేపథ్యం లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలకు అనుగునంగా ప్రతి రోజూ వైద్య సేవలు అందిస్తున్నారు.