మహబూబాబాద్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో కరోనా సెకం డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి వేళ కర్ప్యూ విధిస్తున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు కర్ఫ్యూ ఉంటుందన్నా రు. రాత్రి 8 గంటల వరకు వ్యాపార సముదాయాలు మూసివేయాలన్నారు. అత్యసవర సేవలు మినహా అన్ని సేవలు బంద్ చేయాలని సూచించారు.
ప్రజలు సహకరించాలి
కురవి : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి 9 నుంచి ఉద యం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కురవి, సీరోలు ఎస్సైలు శంకర్రావు, రాణాప్రతాప్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో కోరారు. అనుమతి లేని వాహనాలు రోడ్డుపై కనబడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొత్తగూడ : కరోనా కష్టకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు సీఐ రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఫారెస్టు, పోలీస్, ఆర్ఎంపీ వైద్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ఫారెస్టు అధికారులు గ్రామస్తులకు చెప్పి ట్రంచ్ పను లు చేపట్టాలన్నారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనారోగ్య లక్షణాలతో ఎవరైనా ఆర్ఎంపీ వైద్యుల వద్దకు వస్తే వారిని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు పంపించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై సురేశ్, గంగారం ఎస్సై చంద్రమోహన్, కొత్తగూడ ఎఫ్ఆర్వో రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కర్యూకు సహకరించాలి…
బయ్యారం : కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అదేశాల మేరకు చేపట్టనున్న కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని గార్ల, బయ్యారం సీఐ తిరుపతి కోరారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు పాటించాలి
గార్ల : ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఎస్సై బాదావత్ రవి నాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి వాడవాడలా తిరుగుతూ అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ నిబంధనలు పాటించాలన్నారు. శ్రీరామనవమి వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని తహసీల్దార్ కటకం స్వాతిబిందు ఓ ప్రకటనలో తెలిపారు.
డోర్నకల్లో
డోర్నకల్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ అన్నారు. మండ ల కేంద్రంలోని సెకండ్ మెయిన్ రోడ్డులో ఆయన స్థానికులతో మాట్లాడారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్వహించే కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎస్సై వాంకుడోత్ భద్రూనాయక్, టీఆర్ఎస్ నాయకులు కొత్త రాంబాబు పాల్గొన్నారు.
కరోనా కట్టడికే కర్ఫ్యూ
తొర్రూరు : కరోనా కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందని సీఐ ఎన్.కరుణాకర్రావు, ఎస్సై సీహెచ్.నగేశ్ తెలిపారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు సహకరించాలి
చిన్నగూడూరు : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ కోమల అన్నారు. మంగళవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. రెండో విడుత కరోనా తీవ్రత దృష్ట్యా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో జరిమానా తప్పదని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించొద్దు
దంతాలపల్లి : కరోన నివారణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై బీ వెంకన్న తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు.