తొర్రూరు, ఏప్రిల్ 20 : దంచికొడుతున్న ఎండలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణ ప్రాంగణాలు (బస్టాండ్) లేని ప్రాంతాల్లో బస్సులను బస్ షెల్టర్గా ఏర్పాటు చేస్తున్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి కాలం చెల్లిన బస్సును తాత్కాలిక బస్టాండ్ గా మార్చి వినియోగిస్తున్నారు. ఇం దులో భాగంగా మహబూబాబాద్ క్రాస్ రోడ్డులో అంబేద్కర్ సెంటర్ వద్ద నీడ లేక ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు పాత బస్సును షెల్టర్గా ఏర్పాటు చేశారు. మంగళవారం డిపో మేనేజర్ రమేశ్బాబు సిబ్బందితో కలిసి బస్సు బస్టాండ్ను ప్రారంభించారు. ఉద యం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీఐ బోయెజ్ కుమార్, ఎంఎఫ్ గోపాల్రెడ్డి, సూపర్వైజర్లు నారాయణ, ప్రసాద్, సిబ్బంది లాలు, వెంకన్న, రమేశ్ పాల్గొన్నారు.