మేడ్చల్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): ధరణి ట్రిబ్యునల్ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ చేసుకున్న దరఖాస్తులను మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారుల వాదనలను వారం రోజుల తర్వాత ట్రిబ్యునల్ కమిటీ విననున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రిబ్యునల్ కమిటీ ఉత్తర్వులను అంగీకరించని వారి నుంచి అప్పీల్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15, 16వ తేదీలలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా మరోమారు వాదనలను వినిపించేందుకు 110 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారుల వాదనలను వినిపించేందుకు వారం రోజుల తర్వాత తేదీలను నిర్ణయించనున్నారు. వచ్చిన 410 దరఖాస్తులలో ప్రతి రోజు 20 చొప్పున వాదనలు ట్రిబ్యునల్ కమిటీ విననుంది.