మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.
దాయాదులే కక్ష పెంచుకొని నరసింహులును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి