అంతస్తులపై పచ్చలహారం
టెండ్గ్రా మారిన టెర్రస్ గార్డెనింగ్ కల్చర్
ఇంటి అవసరాల కోసం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కల పెంపకం
రసాయనాల జోలికి వెళ్లకుండా, డాబాలపైనే సాగు
మిద్దెసాగు, పెరటి తోటల పెంపకంపై పట్టణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నది. ఎలాంటి పురుగు మందులు వాడకుండా తాజా కూరగాయలను పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు అనుగుణంగా ఇష్టమైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ఇంటి కప్పుపై పెంచుతున్నారు. మట్టి కుండలు, ప్లాస్టిక్ డబ్బాల్లో మట్టి నింపి వాటిలో కూరగాయల విత్తనాలు నాటి ఆవుపేడ, బెల్లం, బియ్యం కడిగిన నీళ్లు వంటివి ఎరువులుగా వినియోగిస్తున్నారు. తక్కువ నీటితో మొక్కలు ఏపుగా పెరిగి కాతకొస్తున్నాయి. కొందరు గృహిణిలు ఇంటి లోపలి కంటే దాబా గార్డెన్లోనే ఎక్కువ సమయం గడుపుతూ అన్ని రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలను పండించుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు మిద్దెసాగు, పెరటి తోటల పెంపకంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. పరిమితంగా స్థలం ఉండే పట్టణాల్లో మిద్దెసాగును ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తున్నది. జనగామ పట్టణంలో ఇప్పుడిప్పుడే టెర్రస్ గార్డెన్పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై ఉద్యాన శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. దాబాలపై సాగు విధానం ద్వారా తాజా కూరగాయలు, పండ్లు, పూలు లభించడంతోపాటు ఇంటిపై పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.
ఇంటిపైనే తీరొక్క రకాలు
జనగామ జిల్లాకేంద్రంలోని శ్రీనగర్కాలనీకి చెందిన చెరబుడ్ల మాలతీరెడ్డి మూడేళ్లుగా టెర్రస్లో వివిధ రకాల కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుతున్నారు. వెయ్యి స్వేర్ఫీట్ల స్థలంలో టమాట, మిర్చి, వంకాయతో పాటు ద్రాక్ష, జామ, దానిమ్మ, అరటి, సపోట, బొప్పాయి, సీతాఫలం వంటి పండ్లు సాగుచేస్తున్నారు. మాలతీరెడ్డి భర్త, పిల్లల ప్రోత్సాహంతో ఇంటి డాబాను నంద నవనంగా మార్చారు. ఆర్గానిక్ విధానంలో మిద్దె సాగు కోసం ఆవుమూ త్రం(గోపంచకం), బెల్లం, బియ్యం కడిగిన నీళ్లు, పిండిపదార్థాలు, వాడిన టీ పొడిని వినియోగిస్తున్నారు. కోతుల నుంచి రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
ఇవి కూడా చదవండి
మారిషస్లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం