కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలి
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
అడిషనల్ డీసీపీ శరత్ చంద్ర పవర్
అన్నారంలో తనిఖీలు
కోటపల్లి, ఏప్రిల్ 9 : భద్రతపై భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల అదనపు డీసీపీ శరత్ చంద్ర పవర్ అన్నా రు. మండలంలోని అన్నారంలో గురువారం ఉద యం ఏసీపీ నరేందర్, సీఐలు నాగరాజు, ప్రమో ద్ కుమార్, ఎస్ఐలు రవికుమార్, రహీంపాషా, పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటినీ తనిఖీ చేసి, వివరాలు సేకరించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర పవర్ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే కార్డ న్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా గ్రా మాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చి ఆశ్రయం తీసుకుంటే దొరికిపోతారని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్డన్ సెర్చ్లో మొత్తం 52 మంది పోలీసులతో పాటు రెండు స్పెషల్ పార్టీ టీంలు పాల్గొనగా, 19 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 4 కలప దుంగలు, 4 డ్రమ్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు.