హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాప్తిని నిరోధించేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. గతంలోలాగానే మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, పారిశుద్ధ్యం తదితరశాఖలతో సమన్వయం చేసుకొంటూ ముందుకుసాగాలని నిర్ణయించింది. సరిహద్దు జిల్లాల్లో నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేయడంతోపాటు, వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న ప్రాంతాలను గుర్తించి మైక్రో కంటైన్మెంట్జోన్లు ఏర్పాటుచేనున్నది. ఈ మేరకు 7 కీలక అంశాలతో నూతన యాక్షన్ప్లాన్ను సిద్ధంచేసింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచడం, పాజిటివ్ కేసులను వేగంగా గుర్తించి చికిత్స అందించడం, వ్యాక్సినేషన్ను వేగవంతంపై దృష్టి సారించింది. మంగళవారం అన్నిజిల్లాల డీఎంహెచ్వోలతో వీడియోకాన్ఫరెన్స్లో కొవిడ్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు.
పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా కేసులు పెరుగుతుండటంతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో మంగళవారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నారు. కొందరు వారం, మరికొందరు 15 రోజులు లాక్డౌన్ ప్రకటించుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని నిర్ణయించారు.
ఇదీ యాక్షన్ ప్లాన్..
‘ప్రైవేటు’లో సగం బెడ్లు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానల్లో సగం పడకలు కరోనా చికిత్సకోసం అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దవాఖానల్లో సగం పడకలను కరోనా చికిత్సకు కేటాయించేందుకు సిద్ధమని దవాఖాన యాజమాన్యాలు తెలిపాయి. మానవతా దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకే చికిత్స అందిస్తామని పేర్కొన్నాయి. ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలతో మంగళవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు ఫలప్రదమయ్యాయి. కరోనా సాధారణ లక్షణాలు ఉండి చికిత్స పొందాలనుకునేవారి కోసం హోటళ్లలో కార్పొరేట్ దవాఖానలు కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్
నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?