హాలియా, పెద్దవూర, ఏప్రిల్ 6: నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెప్పలమడుగులో నిర్వహించిన ప్రచారంలో విప్ బాల్క సుమన్, అభ్యర్థి నోముల భగత్తో కలిసి పాల్గొన్నారు. సంగరం, పోతునూరులో నిర్వహించిన ధూంధాంలో మంత్రి జగదీశ్రెడ్డితో తలసాని పాల్గొని మాట్లాడారు. 35 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని జానారెడ్డి.. ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అందించే సంక్షేమ ఫలాలు ప్రతిఇంటికీ అందుతున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలే భగత్ను గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్ నేతలు అభివృద్ధి ని రోధకులుగా మారారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హిందూ పండుగలకు గుర్తింపు వచ్చిందని, పురాతన దేవాలయాలు అభివృద్ధి చెందాయని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేందర్శర్మ అన్నారు. పేద బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన అర్చక చైతన్య యాత్రను మంగళవారం సూర్యాపేటలో ప్రారంభించారు. తెలంగాణ అర్చక సమాఖ్య పంచాంగాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, రాష్ట్ర కార్యదర్శి వలివేటి వీరభద్రశర్మతో కలిసి ఆవిష్కరించారు. నోముల భగత్కు మద్దతు ప్రకటించారు.
హాలియా, ఏప్రిల్ 6: సాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కోసం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం స్థల పరిశీలన చేశారు. హాలియా పట్టణం సమీపంలోని దేవరకొండ రోడ్డులో స్థలాన్ని పరిశీలించి సభకు అనువైనదిగా గుర్తించారు. సభకోసం ఏర్పాట్లుచేయనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్
నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు