న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంగళవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కరోనా మహమ్మారి కట్టడిపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు.
ఈ సమావేశంలో 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. తాజాగా కొవిడ్ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే స్కూళ్లు, విద్యాసంస్ధలను మూసివేశాయి. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు కఠిన నియంత్రణలను అమలు చేస్తున్నాయి.