ముంబై : తమ స్టాల్లో పానీపూరి తిన్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు విక్రేతను ముగ్గురు యువకులు చితకబాదిన ఘటన పుణేలోని కరస్వాడి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని కాలేజ్లో చదువుకుంటూ ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా పానీపూరి స్టాల్లో రాజస్ధాన్కు చెందిన కరణ్ పనిచేస్తున్నాడు. సాయంత్రం సమయాల్లో ఖాళీగా ఉండకుండా స్టాల్లో విక్రేతగా పార్ట్టైమ్ విధులు నిర్వహిస్తున్నాడు.
ఇక అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం సాయంత్రం స్టాల్ వద్దకు వచ్చి పానీపూరి తిన్నారు. ఆపై డబ్బులు ఇవ్వకుండా వెళుతుండగా కరణ్ అడ్డుకున్నాడు. దీంతో ముగ్గురు యువకులు కరణ్పై దాడికి దిగారు. తమను డబ్బులు అడుగుతావా అంటూ బాధితుడిపై చేయిచేసుకుని అక్కడనుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు.