హైదరాబాద్ : మహిళా యూట్యూబర్ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకుగాను నగరంలోని పాతబస్తీకి చెందిన సామాజిక కార్యకర్త సయ్యద్ సలీంపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హఫీజ్బాబానగర్ నివాసి, ఎన్జీవో అధ్యక్షుడు సయ్యద్ సలీం యూట్యూబ్ మహిళా రిపోర్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఫేస్బుక్లో ఖిద్మత్ ఇ-ఖల్క్ ఛారిటబుల్ ట్రస్ట్ను నడుపుతున్నారని ఆరోపించారు. సలీం తన ఫేస్ బుక్ పేజీ లైవ్ ద్వారా సదరు మహిళపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఆ మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చంద్రాయణగుట్ట ఎస్హెచ్వో రుద్ర భాస్కర్ తెలిపారు. ఫిర్యాదును అనుసరించి నిందితుడిపై ఐపీసీ 354, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం సలీంను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.