ముంబై : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో మహమ్మారి విరుచుకుపడుతున్నా పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ ధరించాలని కోరినందుకు పెట్రోల్ పంప్ సిబ్బందిపై ఐదుగురు యువకులు దాడి చేసిన ఘటన పుణేలోని మహలుంగే ప్రాంతంలో వెలుగుచూసింది. ఈనెల 14 తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని బాధితుడు నాందేవ్ జరే తెలిపాడు.
ఐదుగురు యువకులు పెట్రోల్ బంకుకు రాగా వారిని మాస్క్ ధరించాలని నాందేవ్ కోరగా నిందితుడు శంభు భోసాలె తన స్నేహితులతో కలిసి నాందేవ్ పై కర్రలతో దాడికి దిగాడు. ఆపై పెట్రోల్ బంక్ ను ధ్వంసం చేశాడు. నాందేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట చేయలేదు.