యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలోని మిస్పా చర్చి కంపౌడ్, మరమత్తుల కోసం ప్రభుత్వం రూ. 5లక్షలను మంజూరు చేసింది. మంజూరుకు సంబంధించి ప్రోసిడింగ్ పత్రాలను చర్చి ఫాథర్ డేవిడ్కు మంగళశారం ఎమ్మెల్యే అందజేశారు. మైనార్టీల సంక్షేమం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కన్నెబోయిన డ్యాని, రాములు, మల్లయ్య, యాదగిరి, పోచయ్య, నర్సయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి