వివిధ పార్టీలు, సంఘాల నుంచి మంత్రి సమక్షంలో చేరిక
ఖమ్మం, ఏప్రిల్ 20: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లకు చెందిన 480 మంది నాయకులు, కార్యకర్తలు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి పువ్వాడ గులాబీ జెండాలు కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు నంద్యాల నర్సింహారావు, రావులపాటి శ్రీనివాసరావు, తుపాకుల కృష్ణయ్య, ఉపేందర్, నంధ్యాల వెంకటేశ్వర్లు, వేముల దుర్గారావు, ఉపేందర్రావు, పవన్కుమార్, డీ.మనోహర్, వడ్డీ రాము, కందుల సురేశ్, వెంకటేశ్వర్లు, శ్రీను, రాము, విజయ్, గుణ, భద్రా, అజీమ్, ముని, కిరణ్కుమార్, రవీందర్తోపాటు 250 మంది ఉన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల వృత్తుల వారికి 250 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇవ్వడం పట్ల ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. కేఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం పనిచేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటామని అన్నారు. అలాగే 15వ డివిజన్ అల్లీపురం ఎస్సీ కాలనీ నుంచి రావూరి రమేశ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి మంత్రి పువ్వాడ సమక్షంలో 230 మంది టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో రమేశ్తోపాటు గుండె కృష్ణ, నల్లగుట్ల వెంకట్రాములు, గడ్డల నాగేశ్వరరావు, గుండె ఆదినారాయణ, టీ.ఫకీర్, గుండె గురవయ్య, తిరుపతయ్య, భూషయ్యలతోపాటు 230 మంది ఉన్నారు. వారందిరికీ మంత్రి అజయ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నాయకులు రావూరి సైదుబాబు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.