హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఔటర్ రింగ్రోడ్ వెంట సగం కాలిపోయిన బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలు పోచారం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన స్రవంతి (17) గా గుర్తించారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య కోణంలో విచారణ జరుపుతున్నారు. స్రవంతి ఈ ఏడాదే పదో తరగతి పూర్తి చేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.