అమరావతి : ఏపీ సీఎం జగన్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ప్రచార సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు సీఎం జగన్ తిరుపతి ప్రజలకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘‘కరోనా కేసులు పెరుగుతున్నందున ఎన్నికల ప్రచార సభకు రాలేకపోతున్న.
నేను సభకు వస్తే వేలాదిగా వచ్చే జనంతో మీ ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమే నాకు ముఖ్యం.
నేను వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయినా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ఓటు వేయాలి.
నిన్న ఒక్కరోజే 2,765 కేసులు వచ్చాయి. తిరుపతి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని చిత్తూర్ జిల్లాలో 496 కేసులు, నెల్లూరు జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి.
ఈ రెండు జిల్లాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు’’ అని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి