రంగారెడ్డి : చేపలు పట్టడానికి చెరువు వద్దకు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టడంతో మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్ఐ నారాయణ సింగ్ కథనం ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన పర్వాద గణేష్ (30) చేపలు పట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గురువారం సాయంత్రం చేపలు పట్టడానికి గండిపేట చెరువుకు బైక్పై వెళ్తుండగా చిలుకూరు సమీపంలోని మూలమలుపు వద్ద ట్రాక్టర్ బైక్ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన గషేణ్ను స్థానికులు చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం