మెదక్ : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామానికి చెందిన గోదాల అశోక్ (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
కాగా బుధవారం రాత్రి స్థానిక తుమ్మచెరువులో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బంధువులు, గ్రామస్తులు గురువారం చెరువులో గాలించగా అందులో ప్రమాదవశాత్తు మృతి చెంది పడి ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.