మద్దూరు/సిద్దిపేట : విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మద్దూరు మండలంలోని వల్లంపట్లలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండెగోని రాజు(28) తన ఇంటి ఆవరణంలోని ఇనుప తీగపై బట్టలు ఆరేస్తున్న క్రమంలో తీగకు సర్వీస్ వైరు తగలడంతో కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజును చికిత్స కోసం చేర్యాల సర్కారు దవఖానకు తరలించారు. రాజు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ