మహబూబ్నగర్ : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామశివారులో సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన దేబాషిష్ దళై (24) అనే యువకుడు బైక్పై జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్నాడు. రాణిపేట శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట వెళ్తున్న ఆవును ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్ ఢీకొట్టిన వేగంగా ఆవు కూడా మృత్యువాతపడింది. ఆమనగల్లు కాటన్ మిల్లులో యువకుడు రోజువారీగా కూలిగా పని చేస్తున్నట్లు తెలిసింది.