ఘట్కేసర్, మార్చి 9 : పోచారం మున్సిపాలిటీ… పోచారంలోని స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి మహాశివరాత్రి పూజలను మంగళవారం ప్రారంభించారు. ఆలయ పూజారులు మంత్రి మల్లారెడ్డిని పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. ఆలయ వ్యవస్థాపకులు చెరుకు సరిత, బద్రీనారాయణ గౌడ్తో కలిసి మంత్రి పూజలు చేసి ధ్వజారోహణం నిర్వహించారు. శుక్రవారం వరకు పూజలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. 12న స్వామివారి విమాన రథోత్సవంతో పూజలు ముగుస్తాయని తెలిపారు. చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు బి.ఆంజనేయులు గౌడ్, బి.మమతారాణి, బి.హరిప్రసాద్రావు, నాయకులు పావనీ జంగయ్య యాదవ్, బుచ్చిరెడ్డి, బాల్రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలను సన్మానించారు.