మహబూబ్నగర్ : కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు గంగాధర్ బైక్పై జడ్చర్లకు వెళ్తున్నారు. గ్రామశివారుకు చేరుకోగానే జడ్చర్ల నుంచి మిడ్జిల్ వైపు వస్తున్న కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఆనంద్ (28) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా గంగాధర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర దవాఖానకు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.