హైదరాబాద్ : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతి ఇంటి నుంచి బయటకు రమ్మంటే రాలేదన్న మనస్తాపంలో భవనం పైనుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి శోభన కాలనీలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట నెహ్రూనగర్కు చెందిన శుభమ్ (26)కు బాలానగర్ శోభన కాలనీకి చెందిన యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. దీంతో నిన్నరాత్రి శుభమ్ యువత ఇంటి వెళ్లి ఇంటి నుంచి బయటకు రావాలని యువతిని కోరారు. ఆమె రాకపోవడంతో నానాయాగీ చేసి యువతితోపాటు ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా యువతి తల్లిదండ్రులే శుభమ్ను కొట్టి చంపారని పోలీసులకు అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.