జోగులాంబ గద్వాల : జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాక్ పై పడుకొన్న అతన్ని గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని రైల్వే పోలీస్ రామకృష్ణ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం