ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కరోనా బారిప పడుతున్నారు. అయితే ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి మాస్క్తో పాటు శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు టీకా కూడా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్స్ సైతం టీకా వేసుకుంటున్నారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రజనీ తన ఇంట్లో వ్యాక్సిన్ తీసుకోగా, అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అన్నాత్తె సినిమా షూటింగ్ కోసం 35 రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్న తలైవా రీసెంట్గా చెన్నైకు వచ్చారు. తలైవా సతీమణి రజనీకాంత్కు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. రజనీకాంత్ నటించిన అన్నాత్తె చిత్రాన్ని సిరుతై శివ దర్శకత్వం తెరకెక్కిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల