జగిత్యాల: జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఆరెపల్లి వద్ద ఆటో, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళ మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బుధవారం ఉదయం జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై టాటా ఏస్ ట్రాలీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని ట్రాలీ.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుద్దింది. దీంతో స్తంభం విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..