భూత వైద్యం పేరిట లైంగిక దాడి.. దొంగబాబాకు దేహశుద్ది

నిజామాబాద్ : భూతవైద్యం పేరిట ఓ దొంగబాబా మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. అమ్మాయిలను లోబర్చుకున్నాడు. ఓ యువతికి కడుపునొప్పి రావడంతో బాబా అసలు బాగోతం బయటపడింది. దీంతో అతనికి బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని జవహర్ నగర్ కాలనీలో వెలుగు చూసింది.
ఆరోగ్యం బాగాలేని అమ్మాయిలు, మహిళలకు నయం చేస్తానని దొంగ బాబా నమ్మించాడు. ఒకట్రెండు రోజుల్లో రోగం నయం కాదు.. కొన్ని వారాలు పడుతుంది అని బాబా మాయమాటలు చెప్పేవాడు. ఈ క్రమంలో మహిళలను లైంగికంగా వేధించేవాడు. అమ్మాయిలను తన ఇంటికి పిలిపించుకుని మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు.
అయితే నిజామాబాద్కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక.. బాబా వద్ద భూత వైద్యం తీసుకుంటుంది. ఆ బాలికకు మంగళవారం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె లైంగిక దాడికి గురైందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో తనకు జరిగిన ఘోర అవమానాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో దొంగబాబా వద్దకు వెళ్లిన బాధితురాలి కుటుంబ సభ్యులు.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
- మొదలైన సర్కారు వారి పాట షూటింగ్.. వీడియో
- రెండు బస్సుల మధ్య బైకు.. బ్యాంకు మేనేజర్ మృతి
- మెక్సికో ప్రెసిడెంట్కు కరోనా పాజిటివ్
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్