హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మరో మహిళ మోసపోయింది. నగరంలోని చింతల్కు చెందిన గాయత్రి దేవీ(36) అనే మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.8 లక్షలు లూఠీ చేశారు. కౌన్ బనేగా కరోడ్పతిలో రూ.25 లక్షలు గెలుచుకున్నారంటూ మహిళకు గాలం వేశారు. ప్రైజ్మనీ పంపేందుకు ఛార్జీలు చెల్లించాలంటూ మహిళకు ఫోన్ చేశారు. ఇది నమ్మిన మహిళ విడతలవారీగా రూ.8 లక్షలు నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. ప్రైజ్మనీ రాకపోవడంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.