లక్నో : భర్త ఇంటి నుంచి ఇద్దరు కూతుళ్లతో బయటకు వచ్చిన మహిళ (35) ఐదేండ్ల కూతురిని రూ 500కు ఓ వ్యక్తికి అమ్మేందుకు ప్రయత్నించిన ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగుచూసింది. మధురాలోని ఫరా బ్లాక్ లో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరేండ్ల కిందట మహిళను ఆమె పెద్ద కూతురుతో కలిసి రూ 40,000కు ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఇక మహిళ తన కూతురిని రూ 500కు విక్రయిస్తోందని టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ రావడంతో మహిళ వ్యవహారం బయటపడింది. దీంతో ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్ మహిళను ఇద్దరు కూతుళ్లను ఫరా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. మహిళ మానసిక పరిస్థితి బాగా లేదని దర్యాప్తులో వెల్లడైంది. ఇక ప్రభుత్వ షెల్టర్ హోంకు వారిని తరలించారు.