సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బాలకృష్ణ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.