హైదరాబాద్ : యోగాతో నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి మహమ్మారి వైరస్లను సైతం ఎదుర్కునే శక్తి చేకూరుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్లోని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గ్రీన్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఐ చైర్మన్ సమీర్ గోయల్తో కలిసి యోగాసానాలు వేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యోగా చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో నిత్యం యోగా చేయడం ఎంతో ముఖ్యమన్నారు. వైరస్ను ఎదుర్కోవడంలో రోగనిరోధక శక్తి ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు నిత్యం అరగంట పాటు యోగా చేసుకోవడం మంచిదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యోగాను పరిచయం చేసింది భారతదేశమేనన్నారు. యోగాతో పాటు వ్యాయామం చేసుకోవడం ద్వారా శరీరాన్ని కాపాడుకోవచ్చన్నారు.
థర్డ్ వేవ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలవోకగా ఎదుర్కునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందన్నారు. అనంతరం సీఐఐ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐఐ టూరిజం వింగ్ కన్వీనర్ ఆనందిత, జయ భారతి, యోగా గురువు హర్షిత, సీఐఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు